విజయవాడలో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో ప్రారంభం

-

దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో తాజాగా సీఎం నారా చంద్రబాబు నాయుడు స్విచ్ ఆన్ చేసి  ప్రారంభించారు. ప్రధానంగా  డ్రోన్ షో తో పాటు లేజర్ షో కూడా నిర్వహించారు. 5,500 డ్రోన్ లతో ప్రదర్శన చేశారు. ఈ డ్రోన్ షో చూసేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు.  ఈ డ్రోన్ చూపర్లను ఆకట్టుకుంటోంది.

విజయవాడ పున్నమిఘాట్ వద్ద నిర్వహిస్తున్న ఈ షో ఎంతో హైలెట్ గా నిలిచింది. ఓవైపు లేజర్ లైట్లు.. మరోవైపు డ్రోన్ షో ప్రధానంగా ఆకర్షిస్తోంది. చిన్న పిల్లలు అయితే ఈ షో ని చూసి సంబుర పడుతున్నారు. దీపావళి పండుగ ముందుగానే దీపావళి పండుగలా కన్నుల విందు చేసింది ఈ షో. ఈ డ్రోన్ షో తో గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా క్రియేట్ చేయడం విశేషం. 5 రికార్డులు క్రియేట్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version