దమ్ముంటే..షర్మిలకు సీఎం ఇస్తామని జగన్ ప్రకటించాలి – బుద్దా

-

దమ్ముంటే..షర్మిలకు సీఎం ఇస్తామని జగన్ ప్రకటించాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న సవాల్‌ విసిరారు. విశాఖ ఎంపీ ఓ పిరికి పంద… పిరికి రౌడీషీటర్ అంటూ ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ కలుస్తారని.. ఈ దుర్మార్గుడు మీద పోరాటం కోసం కలిసారన్నారు. చంద్రబాబు… పవన్ ను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పాలా…షర్మిలని ముఖ్య మంత్రి చేస్తామని మీరు చెప్పండని వైసీపీకి సవాల్‌ విసిరారు.

అటు YSR మరణంపై టిడిపి నేత బుద్ద వెంకన్న వివాదస్పద వ్యాఖ్యలు చేశారు..ఏడు కొండలను మూడు కొండలు అన్నందుకే.. రాజశేఖర్‌ రెడ్డికి ఆ గతి పట్టిందంటూ ఫైర్‌ అయ్యారు బుద్దా వెంకన్న. ఇవాళ టిడిపి నేత బుద్ద వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. రుషికొండ లో సీఎం క్యాంప్ ఆఫీస్ అని సోషల్ మీడియా లో పోస్టు చేసారు…మళ్లీ ఆ పోస్టు డిలీట్ చేసారని వైసీపీపై ఫైర్‌ అయ్యారు. రుషికొండ మీద సీఎం కార్యాలయాలు కట్టకూడదని తప్పు అని వైసీపీకి తెలుసు అని.. అమర్‌నాథ్‌ నీచంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version