దమ్ముంటే జగన్ రాజీనామా చేయాలి… ఎన్నికల్లో తేల్చుకుందాం – బుద్ధా వెంకన్న సవాల్‌

-

పెద్దిరెడ్డికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. కుప్పంలో చంద్రబాబు రిజైన్ చేస్తాడు.. పులివెందులలో జగన్ రిజైన్ చేసి ఎన్నికలకు రండి తేల్చుకొందామని ఛాలెంజ్‌ చేశారు. జగన్ దగ్గర మెప్పు కోసం పెద్దిరెడ్డి చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని చూశాడని.. పులివెందులలో చంద్రబాబు యాత్రకి వచ్చిన జనాన్ని చూసి మైండ్ పోయింది జగన్ ఇంట్లో కూర్చున్నాడంటూ చురకలు అంటించారు.

నిన్నటి దెబ్బతో పెద్దిరెడ్డికి మైండ్ పోయిందని..డీజీపీ, డీఐజీ, ఎస్పీలు పెద్దిరెడ్డి మాట విని పోలీసులు చంద్రబాబు యాత్రను అడ్డగిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. పోస్టింగులు, ప్రమోషన్స్ కోసంపై తప్పుడు ఆదేశాలు పాటించొద్దు.. పాటిస్తే పుంగనూరు ఘటనే రిపీట్ అవుతుందని వార్నింగ్‌ ఇచ్చారు. ఉమ్మడి కృష్ణ జిలాల్లో ఉన్న పిచ్చి కుక్కల్ని వేసుకొని పెద్ది రెడ్డి తిరుగుతున్నాడు…ప్రజల్లో విప్లవం వచ్చిందని వివరించారు. వైసీపీ జెండాలు పట్టుకొని చంద్రబాబు యాత్ర అడ్డుకుంటాం అంటే చూస్తూ ఊరుకొంటామా..? పుంగనూరు రావాలి అంటే వీసా తీసుకోవాలా? అంటూ ప్రశ్నించారు బుద్దా వెంకన్న.

Read more RELATED
Recommended to you

Latest news