చిత్తూరు వీరప్పన్… పెద్ది రెడ్డి రామచంద్రరాడ్డి – బుద్దా వెంకన్న

-

చిత్తూరు వీరప్పన్… పెద్ది రెడ్డి రామచంద్రరాడ్డి అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు బుద్దా వెంకన్న. కొడుకుతో కలిసి భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని… అబ్బా కొడుకుల ఆగడాలతో ప్రజలు తిరగబడి పుంగనూరులో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారని నిప్పులు చెరిగారు. వారి దాడులు, దారుణాలుచెప్పకుండా టీడీపీ పై పడి ఏడుస్తున్నారని…. వారి కబ్జాలు, దోపిడీల గురించి ప్రజలు పిటీషన్లు, వినతి పత్రాల ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారని ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు బుద్దా వెంకన్న.

Budda Venkanna

పుంగనూరుకే పరిమితం కాకుండా జిల్లా మొత్తం మీద పడి దోచేశారని…. తండ్రి ఎమ్మెల్యే, కొడుకు ఎంపీ, అనచరులు మరోచోట పోటీ చేసి చిత్తూరు జిల్లాలో వేల కోట్లు దోచుకున్నారని ఆగ్రహించారు. చిత్తూరు జిల్లా వీరప్పన్ గా పెద్దిరెడ్డికి నామకరణ చేస్తున్నామని… వారి దోపిడీకి అడ్డం వస్తున్నారనే చంద్రబాబు ను ఓడించేందుకు వందల కోట్లు కుప్పంలో ఖర్చు పెట్టారని ఫైర్‌ అయ్యారు బుద్దా వెంకన్న. ప్రజల సొమ్మును దోచుకుని.. ఆ సొమ్ముతో ఓడిస్తాననే గుడ్డి నమ్మకంతో చంద్రబాబుపై శపధం చేశారని… చంద్రబాబును ఓఢించడం కాదు కదా.. ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారని గుర్తు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version