అంబటి రాయుడుపై బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

-

వైసీపీకి అంబటి రాయుడు రాజీనామాపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న సెటైరికల్ కామెంట్లు చేశారు. అడుదాం ఆంధ్రాకి అంబటి రాయుడు బ్యాట్ పట్టుకొని వచ్చాడన్నారు. వచ్చిన వారం రోజులకే జగన్ సైకో అని అంబటి రాయుడికి తెలిసిందని చురకలు అంటించారు వైసీపీ పార్టీలో చేరిన వారానికే రాయుడు రాజీనామా చేశాడు…..అంబటి రాయుడుకి శుభాకాంక్షలు అంటూ ఎద్దేవా చేశారు టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న.

తిరువూరులోో చంద్రబాబు సభకి విజయవాడ నుంచి ర్యాలీగా వెళ్తున్నామన్నారు. 2024 లో పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేయబోతున్నామని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఎవరనేది చంద్రబాబు చెబుతారని..అందరం కలిసికట్టుగా పార్టీ గెలుపుకు పనిచేస్తామని ప్రకటించారు. టీడీపీలో పదవులు ఇవ్వటంతో పాటు నేతలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. వైసీపీలో పదవులు ఇవ్వడమే కాదు.. ఆ నేతలకు గుర్తింపు తీసుకురా వాలని కోరారు. టీడీపీలో ఉన్న బీసీ నేతలకు వైసీపీలో ఉన్న బీసీ నేతలకు పోలిక లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news