వివేకా పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలున్నాయి : సీబీఐ

-

 మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఛార్జ్‌షీట్‌లో సీబీఐ పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఫొటోలు, గూగుల్‌ టేకౌట్‌, ఫోన్ల లొకేషన్‌ డేటాను సీబీఐ కోర్టుకు సమర్పించింది. గత నెల 30న సమర్పించిన ఛార్జ్‌షీట్‌ను సీబీఐ కోర్టు ఇటీవల విచారణకు స్వీకరించింది.

వివేకా హత్యకు ఎంపీ అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి కుట్ర చేశారని సీబీఐ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. వివేక పీఏ కృష్ణా రెడ్డిపై అనుమానాలు ఉన్నప్పటికీ తగిన ఆధారాలు లభించలేదని.. సాక్ష్యాల చెరిపివేత సమయంలో వైఎస్ మనోహర్ రెడ్డి ఉన్నా.. ఆయన ప్రమేయం ఇంకా నిర్ధారణ కాలేదని తెలిపింది. ”వివేకా లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్ష నివేదిక రావాల్సి ఉంది. ఆయన ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్టైన వారి వివరాలను సేకరిస్తున్నాం. దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని అమెరికా అధికారులను కోరాం. పలు మొబైల్ ఫోన్ల ఫొరెన్సిక్ నివేదికలు త్రివేండ్రం సీ డాక్ నుంచి అందాల్సి ఉంది’’ అని కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్‌లో సీబీఐ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news