లోకేష్ కి పేర్నినాని సవాల్.. సిట్టింగ్ జడ్జీతో విచారణకు సిద్దమా..?

-

చంద్రబాబు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన చంద్రబాబు. ముద్రగడ పద్మనాభం నిరసనకు దిగితే ఆయనను వేధించారు. చంద్రబాబు జైలుకెళ్తే టీడీపీ నాయకులు ఎవరూ బాధపడటం లేదు. నిరసన కార్యక్రమాలను కేవలం రాజకీయ కార్యక్రమాలుగా మాత్రమే చేశారు. లంచాలు తిని కంచాలు మోగిస్తారా అంటూ దుయ్యబడ్డారు.

చంద్రబాబు జనం సొమ్ము తిన్నారని ప్రజలు భావిస్తున్నారు. అందుకే నిరసన కార్యక్రమాల్లో ఎవరు పాల్గొనడం లేదు. కోటి మంది కేడర్ ఉందని చెప్పుకునే టీడీపీకి మద్దతు ఎక్కడుంది. అక్రమ కేసులయితే చంద్రబాబుకు ఎందుకు కోర్టులో అనుకూల తీర్పులు రావడం లేదు. అమరావతి స్కాం, విన్నర్ రింగ్ రోడ్ స్కాంలో భారీగా వెనకేసుకున్నారు. చంద్రబాబు జైల్లో ఉంటే లోకేష్ ఢిల్లీ వెళ్లిపోయారు. టీడీపీ కార్యకర్తలు కేసులు పెట్టించుకోవాలని లోకేష్ పిలుపునిచ్చారు. చంద్రబాబుపై కేసులో ఉంటే లోకేష్ ఎందుకు లాయర్ల చుట్టూ తిరుగుతున్నారు అని పేర్ని నాని ప్రశ్నించారు.

లోకేష్ కు దమ్ముంటే చంద్రబాబు అక్రమాస్తుల మీద విచారణకు సిద్ధం అవ్వాలి. చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి విచారణ చేద్దాం. సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా..? చంద్రబాబుపై ఉన్న కేసులనింటిపైనా ఎందుకు స్టే తెచ్చుకున్నారు. బాబు ఇంతకాలం స్టేలు తెచ్చుకుని బతికాడు. యావజ్జీవ ఖైదు తప్పదనే స్టేలు తెచ్చుకున్నారు. కోర్టుల్లో చంద్రబాబు నిజాయితీ నిరూపించుకోవాలి అంటూ పేర్ని నాని హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news