సెల్‌ఫోన్ టార్చ్ ఇంట్రడ్యూజ్ చేసింది నేనే – చంద్రబాబు

-

TDP అధినేత చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి సభ ఏర్పాటు చేసి ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో తమకు సంఘీభావంగా ప్రజలంతా తమ సెల్ ఫోన్లలో టార్చ్ లైట్ ఆన్ చేసి చూపించాలని కోరారు.

‘టార్చ్ లైట్ ఆకాశంలో నక్షత్రాల్లా వెలిగిపోతున్నాయి. టెక్నాలజీ వల్లే ఇది సాధ్యమైంది. దీన్ని కూడా నేనే ఇంట్రడ్యూస్ చేశా’ అని చెప్పారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.

ఇక అటు ఇంటర్మీడియట్‌లో ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలని చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. నేను చెప్పంగ చెప్పంగ విని మీరు టెక్నాలజీలో నంబర్ 1 అయిపోయారని చంద్రబాబు తెలిపారు. ఈ వ్యాఖ్యలను విజన్ 2046 కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news