చంద్రబాబు అవినీతి అనకొండ – మంత్రి రోజా

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు అరెస్టును రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే అని విమర్శించారు. చంద్రబాబు అవినీతి అనకొండ అని.. రూ. 241 కోట్లు కొల్లగొట్టి పక్కా ఆధారాలతో దొరికారని తెలిపారు. ఆయన బోగస్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు మంత్రి రోజా.

అంతేకాదు దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది అని అన్నారు. చంద్రబాబు అరెస్టుతో న్యాయవ్యవస్థ పై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. చంద్రబాబు కడిగిన ముత్యం కాదని.. అవినీతిలో కూరుకుపోయిన ముత్యమని ఎద్దేవా చేశారు. టిడిపి నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఇక త్వరలోనే నారా లోకేష్, అచ్చెన్నాయుడు కూడా అరెస్ట్ అవుతారని అన్నారు.

వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, స్టేలు తెచ్చుకుంటూ, తప్పించుకుంటూ వచ్చిన చంద్రబాబు.. జగన్ ప్రభుత్వ హయాంలో అది సాధ్యం కాలేదు అన్నారు. జగన్ ఏ తప్పు చేయలేదన్న రోజా.. ఇప్పటికీ విచారణను ఎదుర్కొంటున్నారని అన్నారు. చంద్రబాబు కూడా ఈ కేసులో సిబిఐ, ఈడి విచారణకు సిద్ధమని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version