జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం.. చెడుకు ఓటమేనంటూ చురకలు

-

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుపై ఏపీ ప్రభుత్వ దాడులు, అక్రమ కేసులపై ఆగ్రహం వ్యక్తం చేసారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సీఎం జగన్ మీడియాను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని.. నియంతలా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ మోసాలను, పనులను బయటపెడుతున్న ఈనాడు లాంటి సంస్థలను వేధించి, బెదిరిస్తున్నారని ఆరోపించారు  టీడీపీ చీఫ్.  పరిపాలనలో వైఫల్యం, ప్రజలలో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతతో జగన్ నైరాశ్యంలో కూరుకుపోయారని ఎద్దేవా చేశారు చంద్రబాబు. 

దాదాపు 6 దశాబ్ధాలుగా తెలుగు ప్రజలకు సేవ చేస్తున్న మార్గదర్శి వంటి సంస్థలను జగన్ లక్ష్యంగా చేసుకున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు పేర్కొన్నారు. జర్నలిజం, సాహిత్యం, విద్యా రంగాల్లో చేసిన సేవకు గాను రామోజీరావును కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించిందని గుర్తుచేశారు చంద్రబాబు. అలాంటి వ్యక్తిపై వైసీపీ చేసిన దాడులను ఖండిస్తున్నట్లు తెలిపారు. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మంచిపై చెడు ఎప్పుడూ ఓడిపోతుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version