కియా సంస్థపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు !

-

కియా సంస్థపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతపురం నుంచి కియా సంస్థ ఒక మిలియన్ కార్లను ఉత్పత్తి చేసిన మైలురాయిని చేరుకోవడం ఆనందంగా ఉందని.. కియా యాజమాన్యానికి నా హృదయపూర్వక అభినందనలు అన్నారు చంద్రబాబు.

2017లో ఏపీలో కియా పెట్టుబడులు ఓ బలమైన సంకల్పం అని.. ఈ సమర్థ విధానాలు ఆ ప్రాంత రూపురేఖల్ని మార్చి సంపద సృష్టి, ఉపాధి అవకాశాల కేంద్రంగా మార్చిందని వివరించారు. ప్రపంచ వేదికపై ఇది ఓ ప్రత్యేకతను చాటుకుందని.. ఇవాళ రాయలసీమ ప్రయోజనం పొందుతున్నందుకు నేను సంతోషిస్తున్నానని వివరించారు చంద్రబాబు. వేలాది మంది స్థానికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉపాధి పొందుతున్నారన్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version