ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. తాజాగా వ్యవసాయ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా… వ్యవసాయం అలాగే, పోగాకు, సాగు నియంత్రణ, కోకో ప్రత్యేక విధానం పైన దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.

రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలని అలాగే పొగాకును కంపెనీలు కొనాలని సూచనలు చేశారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా క్వింటాలుకు 12,500 చెల్లించాలని…. కోకో గింజలను కిలోపు 500 కు తగ్గకుండా కొనాలని వివరించారు. నష్టపోయిన మిర్చి రైతుల జాబితాను వెంటనే తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కోకో కొనుగోళ్ల కోసం త్వరలో ఆయిల్ పాం తరహా విధానం తీసుకురానున్నట్లు ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. తక్కువ ధరకు మిర్చి అమ్మి నష్టపోయిన రైతుల జాబితాను కూడా తయారు చేయాలని వెల్లడించారు.