బద్వేల్‌ ఇంటర్ అమ్మాయిపై పెట్రోల్ పోసి హత్య..మరణశిక్ష వేయాలని చంద్రబాబు సీరియస్‌ !

-

బద్వేల్‌ ఇంటర్ అమ్మాయిపై పెట్రోల్ పోసి హత్య చేసిన సంఘటనపై..సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. కడప జిల్లా బద్వేల్ లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరం అన్నారు చంద్రబాబు. ఈ ఘటన నన్ను ఎంతగానో కలచివేసిందని తెలిపారు.

chandrababu

ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలి కావడం విచారకరం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా అధికారులు తెలిపారు. ఈ కేసులో వేగంగా విచారణ పూర్తి చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించానని పోస్ట్‌ పెట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడం అంటే….హంతకుడిని త్వరగా, చట్టబద్దంగా, కఠినంగా శిక్షించడమే అన్నారు.

అందుకే ప్రత్యేక కోర్టులో ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఈ కేసు విచారణ పూర్తి చేసి నేరస్తుడికి మరణశిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించానని తెలిపారు. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలని అధికారులకు సూచించానని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news