రావణాసురుడితో పోల్చుతూ సీఎం జగన్ పై చంద్రబాబు సెటైర్లు!

-

రావణాసురుడితో పోల్చుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై సెటైర్లు వేశారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేమగిరిలో మహానాడు వేడుకలో తొలిరోజు చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రావణాసురుడు సాధువు రూపంలో వచ్చి సీతను ఎత్తుకెళ్లినట్టు.. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ఓట్లేయించుకున్నారని విమర్శించారు.

స్కాముల్లో జగన్ మాస్టర్ మైండ్ అని.. సీఎం నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనని అన్నారు. కోడి కత్తి డ్రామా, మధ్య నిషేధం వంటివన్నీ డ్రామాలేనని ఎద్దేవా చేశారు. 2024 లో ఎన్నికలు వచ్చినా.. అంతకంటే ముందు వచ్చినా టిడిపి సిద్ధమేనని ప్రకటించారు. ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 గా మార్చే సత్తా తెలుగుదేశం పార్టీకే ఉందన్నారు చంద్రబాబు. ఇక నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర అద్భుతంగా జరుగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version