భవిష్యత్తు మనదే అమరావతి కేంద్రంగా రాజధాని : చంద్రబాబు

-

తెలుగు ప్రజలందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకొనే ఏకైక పండుగ సంక్రాంతి అని అన్నారు. అమరావతి మందడంలో ‘తెలుగుజాతికి స్వర్ణయుగం – సంక్రాంతి సంకల్పం’ పేరిట భోగి మంటలు కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్తో కలిసి పాల్గొన్నారు. భవిష్యత్తు మనదేనని.. అమరావతి కేంద్రంగా రాజధాని ఉంటుందని భరోసా కల్పించారు. తెలుగు వారెక్కడున్నా జన్మభూమికి వచ్చి సంక్రాంతి జరుపుకొంటారని చెప్పారు.

సంక్రాంతి పండుగకు మాత్రం మేము నారావారిపల్లె వెళ్తాం. సంక్రాంతి పండుగకు రావాలని పల్లె పిలుస్తోంది. పాత వస్తువులు, పనికిరానివి భోగి మంటల్లో వేయడం సంప్రదాయం. ప్రభుత్వ అసమర్థ విధ్వంస విధానాల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. రాజధాని రైతులు అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నారు. చీకటి జీవోలన్నీ భోగి మంటల్లో వేసి తగలబెట్టాం. దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి 87 రోజులు వైఎస్సార్సీపీకి కౌంట్‌ డౌన్‌. అని చంద్రబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version