ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నారా చంద్రబాబు నాయుడు సర్కార్… కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీసీ ఏ లో సామాజిక వర్గానికి భారీ రిలీఫ్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. కుల ధ్రువీకరణ పత్రాలలో భిక్షాటన చేసేవారు… అనే పదాన్ని తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

బిక్షటన చేసే వారు అనే పదం వాళ్ల ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తుందని… గత కొన్ని రోజులుగా ఏపీలో దాసరి సామాజిక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు నాయుడు సర్కార్ దిగివచ్చి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కుల ధ్రువీకరణ పత్రాలలో కేవలం దాసరి అనే పదం మాత్రం ఉండేలా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది కూటమి సర్కార్. ఇకపై భిక్షాటన చేసేవారు అని వాళ్లను కించపరిస్తే కఠిన చర్యలు తప్పవని వెల్లడించింది.