ఆత్మాభిమానానికి ప్రతిరూపం నందమూరి హరికృష్ణ – చంద్రబాబు

-

నిండైన ఆత్మీయతకు, ఆత్మాభిమానానికి ప్రతిరూపం నందమూరి హరికృష్ణ అని కొనియాడారు టీడీపీ అధినేత చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. ఆత్మీయుడు హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని వెల్లడించారు టీడీపీ అధినేత చంద్రబాబు.

ఇక అటు ప్రజలకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రథమ భారతీయ భాషా శాస్త్రవేత్త, తెలుగు వెలుగు గిడుగు వేంకట రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని..ఈ వేళ… ప్రపంచ వ్యాప్త తెలుగువారందరికీ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

తెలుగు వ్యవహారిక భాషలోనే పుస్తక రచన చేయాలని ఉద్యమించి, సాహిత్యాన్ని సామాన్యుడికి చేరువ చేసిన గిడుగు రామ్మూర్తి స్మృతికి నివాళులర్పిస్తున్నానునన్నారు. విద్యావ్యాప్తి జరగాలంటే బోధన జరిగే భాష మాతృభాషే అయి వుండాలని ఆయన ఆశించారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news