చంద్రబాబు మమ్ముల్ని వాడుకొని వదిలేశాడు : ఎంపీ కేశినేని నాని

-

చంద్రబాబు మమ్మల్ని వాడుకుని వదిలేశారు అని  ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.  నేను, స్వామిదాస్ టీడీపీని విడిచిపెట్టడానికి తిరువూరు వేదిక అయింది.  సీఎం జగన్ మా పై ఎంతో ఆత్మీయత చూపించారు. సీఎం జగన్ అభివృద్ధి చేయడం లేదని చంద్రబాబు, ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది. అభివృద్ధిపై మీతో చర్చించేందుకు నేను సిద్ధం అన్నారు.


చంద్రబాబు అమరావతిలో తాత్కాలిక సెక్రటేరియట్, అసెంబ్లీ, కోర్టు కట్టారు. సీఎం జగన్ 30 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు కట్టారు. తాత్కాలిక సచివాలయం కట్టిన చంద్రబాబు గొప్పవాడా?
15 వేల సెక్రటేరియట్లు కట్టించిన సీఎం జగన్ గొప్పవాడా.. ప్రజలు ఆలోచించాలి. ప్రజల ఆరోగ్యం కోసం 8500 కోట్లతో 17 మెడికల్ కాలేజీలకు ఖర్చు పెట్టిన సీఎం జగన్ గొప్పవాడా.. కాదా
కుప్పానికి నీళ్లిచ్చింది కూడా జగనే అన్నారు.  చంద్రగిరిలో గెలవలేక కుప్పానికి వెళ్లిన వలస పక్షి చంద్రబాబు అని అన్నారు.  30 ఏళ్లలో కుప్పానికే ఏం చేయలేనోడు ఏపీని ఏం అభివృద్ధి చేస్తాడు
ఎన్నికలొచ్చినప్పుడల్లా చంద్రబాబుకి బీసీలు గుర్తుకొస్తారు అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news