చౌకబారు డ్రామాలు మీ పేటెంట్ చంద్రబాబు – విజయ సాయి కౌంటర్

-

పశ్చిమ గోదావరి జిల్లా లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వరద ముంచుకోస్తుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రమాదం ముంచుకొచ్చినపుడు ప్రజలకు దగ్గరగా వుండాల్సిన ముఖ్యమంత్రి గాల్లో తిరుగుతున్నాడనీ మండిపడ్డారు. ఎన్నికలు వస్తుంటే మంత్రులను పంపుతారనీ.. వరదలు వస్తె ఎవ్వరినీ పంపరనీ అన్నారు.

పేదవాడికి న్యాయం జరిగే వరకు టిడిపి పోరాటం కొనసాగుతోందనీ తెలియజేశారు.అంతేకాకుండా.. తాగడానికి ఈ నీళ్ళే దిక్కు అంటూ వరదబాధితురాలు బాటిల్లో మురుగునీటిని అందించగా.. చంద్రబాబు దానిని చూపుతూ జగన్ పై విరుచుకుపడ్డారు. ఈ అంశాన్ని ప్రస్తావించిన విజయసాయిరెడ్డి చంద్రబాబుకు కౌంటర్ గా ట్వీట్ వేశారు.”చౌకబారు డ్రామాలు మీ పేటెంట్ చంద్రబాబు.. మీతో అగ్రనటులు కూడా పోటీ పడలేరు. వరద నీటిని బాటిల్లో నింపి జనం వాటినే తాగుతున్నారని మీరు నమ్మించాలని చూస్తే వరద బాధితులే నవ్వుకుంటున్నారు. మీరు జన్మలో మారరు”. అంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version