BREAKING : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

-

BREAKING : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. శ్రీశైలం డ్యామ్‌ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు అంబటి రాంబాబు. ప్రస్తుతం రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.

దీంతో ప్రస్తుతం రెండు గేట్ల ద్వారా నాగార్జున సాగర్‌ వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. భారీ వరదలు వస్తే, మరిన్ని గేట్లు ఎత్తేందుకు రంగం చేసింది ఏపీ సర్కార్‌. కాగా.. వేలాది క్యూసెక్కుల వరద నీరు చేరుకుంటుండటంతో… శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 81,853 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా… 57,751 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది.

డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 882.50 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 202.0439 టీఎంసీల నీరు ఉంది. కుడి, ఎడమవైపు ఉన్న ఏపీ, తెలంగాణ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version