ఇవాళ 3 నియోజక వర్గాల్లో సీఎం జగన్‌ పర్యటన..షెడ్యూల్‌ ఇదే

-

ఇవాళ 3 నియోజక వర్గాల్లో సీఎం జగన్‌ పర్యటిస్తారు. మొదటగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో పర్యటించనున్నారు సీఎం జగన్. 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10 గంటలకు నరసాపురం చేరుకొని బహిరంగ సభలో పాల్గొనున్నారు ముఖ్యమంత్రి జగన్‌. అనంతరం పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటుంది.

CM Jagan will participate in election campaign meetings in three constituencies today

నేడు మధ్యాహ్నం ఒంటిగంటకు క్రోసూరు చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్… మధ్యాహ్నం ఒంటిగంట నుంచి , రెండు గంటల వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అనంతరం కనిగిరిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం జగన్. మధ్యాహ్నం 3.10 గంటలకు కనిగిరి చేరుకోనున్న సీఎం జగన్..3.20 గంటలకు హెలిప్యాడ్ దగ్గర నుంచి బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకోనున్నారు. 3.35 గంటల నుంచి 4.20 గంటల వరకు కనిగిరి ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న సీఎం జగన్..తిరిగి 4.40 గంటలకు తాడేపల్లి బయలుదేరి వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news