కేంద్ర సర్కార్ కు CM చంద్రబాబు లేఖ

-

CM Chandrababu’s letter to Central Govt: కేంద్ర సర్కార్ కు CM చంద్రబాబు లేఖ రాశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఇటీవల సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నీరబ్ పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది.

CM Chandrababu’s letter to Central Govt

ఈ నేపథ్యంలో ఆయన సర్వీసును మరో 6 నెలలపాటు పొడిగించాలని కేంద్రాన్ని సీఎం కోరారు. కాగా, కేంద్రం ఒకే విడతలో 6 నెలలు పొడిగింపు ఇస్తుందా, లేదా 3 నెలల చొప్పున రెండుసార్లు పొడిగిస్తుందా చూడాలి.

అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావును నియమించింది. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న తిరుమలరావును….. కో ఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించారు. హెచ్ఓపిఎఫ్ (పోలీసు దళాల అధిపతి)గా ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.

Read more RELATED
Recommended to you

Latest news