ఆంధ్రప్రదేశ్ ను దొంగల ముఠా దోచుకుంది – సీఎం జగన్

-

ఆంధ్రప్రదేశ్ ను దొంగల ముఠా దోచుకుందని చంద్రబాబు పై ఫైర్ అయ్యారు సీఎం జగన్. చంద్రబాబు పరిపాలనలో జన్మభూమి కమిటీలతో మొదలుపెడితే అమరావతి భూముల వరకు స్కాములే జరిగాయని సీఎం జగన్ ఆరోపించారు. ‘స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్ నెట్, మద్యం కొనుగోళ్లలో కూడా ఎక్కడపడితే అక్కడ స్కామ్ చేసి దోచేయడం, దోచుకున్నది పంచుకోవడం, పంచుకున్నది తినుకోవడం. ఇది తప్ప ఏమి కనిపించలేదు.

cm jagan on chandrababu arrest
cm jagan on chandrababu arrest

కానీ ఈ నాలుగు ఇళ్లలో రూ. 2.38 లక్షల కోట్లు నేరుగా ఖాతాల్లో మేము జమ చేశాం’ అని వాక్యానించారు.నాలుగేళ్లు ఎక్కడ అవినీతి, వివక్ష లేకుండా నేరుగా ప్రజల ఖాతాల్లోకి నిధులు విడుదల చేశామని సీఎం జగన్ వెల్లడించారు. ‘ప్రతి అడుగులో వెనుకబడిన వర్గాల చేయి పట్టుకొని నడిపిస్తున్నాం. నాలుగేళ్లలో అక్కా చెల్లెమ్మలకు తోడుగా ఉన్నాం. నవరత్నాలతో ప్రతి ఒక్కరిని ఆదుకున్నాం. ఎక్కడ, ఎవరు లంచం అడగడం లేదు. బటన్ నొక్కగానే ఖాతాల్లోకి నగదు వస్తుంది. గతానికి ఇప్పటికీ తేడాను గమనించాలి’ అని జగన్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news