త్యాగానికి ప్రతీక మొహర్రం పండుగ – సీఎం జగన్‌

-

త్యాగానికి ప్రతీక మొహర్రం పండుగ అన్నారు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ఇవాళ మొహర్రం పండుగ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ ముస్లింలకు మొహర్రం పండుగ శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్ మోహన్‌ రెడ్డి. త్యాగానికి ప్రతీక మొహర్రం పండుగ… ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ దేవుని కరుణాకటాక్షాలు మన రాష్ట్రం పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు సీఎం జగన్‌.

కాగా, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మొహర్రం శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు జరుపుకునే మొహర్రం త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని కేసీఆర్ అన్నారు. నాటి కాలంలో ఇమామ్ హసన్, ఇమామ్ హుస్సేన్ సహా పలువురి త్యాగాలను స్మరించుకుంటూ మొహర్రం సాగుతుందని చెప్పారు. త్యాగాలకు గుర్తుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ, ముస్లిం సోదరులు తరతరాలుగా మొహర్రం పండుగ‌ను నిర్వహిస్తున్నారని సీఎం గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version