BREAKING : రేపు ఎన్టీఆర్ జిల్లాలో జగన్ పర్యటన

-

సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్టీఆర్‌ జిల్లా పర్యటనకు ముహూర్తం ఖరారు అయింది. రేపు సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు లో పర్యటించనున్నారు. తాడేపల్లినుంచి బయలుదేరి తిరువూరు మార్కెట్ యార్డుకి చేరుకోనున్నారు సీఎం జగన్.

 

ఇందులో భాగంగా రేపు ఉదయం 11.00- 12.30 గంటలకు మార్కెట్‌ యార్డ్‌ సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా జగనన్న విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్. ఇవాళ రేపు మధ్యాహ్నం 1.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్.

Read more RELATED
Recommended to you

Latest news