ఫసల్ బీమా పై సీఎం జగన్ కీలక సూచనలు

-

ఫసల్ బీమాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక సూచనలు చేశారు.ఫసల్‌ బీమా యోజన అందరికీ వర్తింపు చేయాలంటే విధాన పరంగా మార్పు రావాల్సి ఉందన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో 10,444 ఆర్బీకేలు ఉన్నాయని,ప్రతి గ్రామంలో వ్యవసాయ కార్యక్రమాలన్నీ ఆర్బీకేల పరిధిలో జరుగుతాయని తెలిపారు.అగ్రికల్చర్‌ అసిస్టెంట్, బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌లు ఆర్బీకేల్లో పనిచేస్తున్నారని అన్నారు.

గ్రామ సచివాలయాలతో కలిసి ఆర్బీకేలు పని చేస్తున్నాయని,రైతులు సాగుచేసిన ప్రతి పంటను జియో ట్యాగింగ్‌తో ఇ–క్రాప్‌ చేస్తున్నామన్నారు.చాలా దృఢమైన వ్యవస్థ ద్వారా డేటాను సేకరిస్తున్నామని తెలియజేసారు.అందుబాటులో ఉన్న ఇ– క్రాప్‌ డేటాను వినియోగించుకోవాలని సూచించారు.రైతు సాగు చేస్తున్న ప్రతి పంట బీమా పరిధిలోకి తీసుకు వచ్చేందుకు ఉన్న అడ్డంకులను తొలగించామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిందే కాదు, రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు.

మూడొంతుల్లో రెండొతులు ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని,అందరికీ పంట బీమా పరిహారం అందాలనే లక్ష్యంతో ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోందని తెలిపారు.లేకపోతే సాగుచేస్తున్న రైతులందరూ పంటల బీమా పరిధిలోకి రారన్నారు.సన్న, చిన్నకారు రైతులు తరఫున చెల్లించాల్సిన ప్రీమియంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాన వాటా భరిస్తే, మరిన్ని అద్భుతాలు జరుగుతాయన్నారు.

ఈ ఆలోచనపై దృష్టి సారించాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని కోరుతున్నామన్నారు.ఫసల్‌ బీమా యోజనలో కొన్ని రాష్ట్రాలు ఎందుకు లేవన్న అంశం పై దృష్టిపెట్టి, ఆమేరకు మార్గదర్శకాల్లో మార్పులు చేసేందుకు కృషి చేసిన కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.ఇందులో ఉన్న సమస్యలను పరిష్కరించనడానికి కేంద్ర మంత్రి చేసిన కృషిని అభినందిస్తున్నానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news