వైఎస్సార్‌సీపీ శ్రేణులతో 9న విజయవాడలో సీఎం జగన్ సమావేశం

-

వైఎస్సార్‌సీపీ శ్రేణులతో 9న విజయవాడలో సమావేశం జరుగనుంది. సీఎం జగన్‌ అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ శ్రేణులతో 9న విజయవాడలో సమావేశం జరుగనుందని సజ్జల తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ మండలస్థాయి నేతలకు సీఎం జగన్‌ దిశా నిర్దేశం చేస్తారన్నారు సజ్జల. ఈ కార్యక్రమానికి దాదాపు 8 వేలమందికి పైగా ప్రత్యేక ఆహ్వానితులు వస్తారని వివరించారు.

CM Jagan’s meeting with YSRCP ranks in Vijayawada on 9th

ప్రభుత్వ అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని.. చెప్పారు సజ్జల. చంద్రబాబు విప్లవ ఉద్యమాలు చేసి జైలుకెళ్లినట్లు టీడీపీ హడావుడి చేస్తుందని… స్కిల్‌ స్కామ్‌లో బాబు అవినీతిపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. 13 చోట్ల సంతకాలు పెట్టిన విషయం వాస్తవమా.. కాదా? అని ప్రశ్నించారు. నోట్‌ ఫైల్స్‌లో స్పష్టంగా ఉందని.. స్కామ్‌ను పక్కదోవ పట్టించడానికే ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ అంశం తెచ్చారని ఆగ్రహించారు సజ్జల. వీరప్పన్‌ తరహాలో చంద్రబాబు బుకాయింపు చేస్తున్నారని ఆగ్రహించారు. నిజాయితీ పరుడంటూ సొల్లు కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు సజ్జల.

Read more RELATED
Recommended to you

Exit mobile version