ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి కానుక..1.77 లక్షల మందికి లబ్ధి

-

సంక్రాంతి పండుగకు ముందు… ఏపీ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి కానుక అందించారు. ధాన్యం సేకరణకు ఏకంగా రెండు వేల కోట్లు విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ తరుణంలోనే లక్ష 77 వేల మంది రైతుల ఖాతాలలో ఈ డబ్బు జమ అవుతుంది.

CM Jagan mohan reddy Sankranti gift to grain farmers

ఇప్పటివరకు నాలుగు లక్షలకు పైగా ఉన్నటువంటి రైతుల నుంచి ప్రభుత్వం 24.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. రైతులకు 5000 కోట్లు ఇప్పటివరకు చెల్లించారు. ఇక మిగతా రైతుల కోసం రెండు వేల కోట్లను తాజాగా విడుదల చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజులలోనే రైతులకు నగదు జమ చేస్తున్నారు. ఇక ఇప్పుడు సంక్రాంతి ముందే మిగతా రైతులకు డబ్బులు రానుండటంతో రైతులు ఖుషి అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news