BREAKING: బస్సులో మంటలు.. మహిళ సజీవ దహనం

-

తెలంగాణ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సులో మంటలు చెలరేగడంతో ఓ మహిళ సజీవ దహనం అయింది. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి లో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి లో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ తరుణంలోనే బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.

The fire broke out in the bus.. The woman was burnt alive

దీంతో ఓ మహిళ సజీవ దహనం అయింది. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ప్రైవేట్ ట్రావెల్ బస్సు హైదరాబాదు నుంచి చిత్తూరుకు వెళ్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో 40 మంది ప్రయాణికులు ఆ బస్సులో ఉన్నారు. అయితే డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణకు వచ్చారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సంఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news