థ్యాంక్యూ జగనన్న: నాలుగు నెలల ముందే వాహనమిత్ర… ఈసారి ఎంతమందో తెలుసా?

-

ఒకవైపు కరోనా కష్టకాలం.. మరోవైపు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమైన వైనం.. ఈ సమయంలో ఉపాధి లేక, చేతిలో డబ్బులేక ఇబ్బందులు పడుతున్న ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు రెండో ఏడాది వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. తన పాదయాత్రలో భాగంగా జగన్ ఇచ్చిన హామీలను పక్కాగా అమలుచేస్తున్న తరుణంలో… ఈ వాహనమిత్ర పథకాన్ని రెండో ఏడాది కూడా అనుకున్న తేదీకంటే నాలుగు నెలల ముందే అందించనున్నాది జగన్ సర్కార్. గతేడాది కంటే ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్య చాలానే పెరిగింది!

ఈ పథకం కింద గతేడాది 2.36 లక్షల మందికి సాయం అందగా… ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 37,756 వేల మంది ఈ పధకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో గతేడాది లబ్ది పొందిన 2.36 లక్షల మందితోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు రేపు (జూన్ 4) ఆన్ లైన్ ద్వారా అకౌంట్లో రూ.10 వేల చొప్పున జమ చేయనున్నారు. మొత్తం 2,62,493 మంది లబ్దిదారులకు ఈ వాహనమిత్ర ద్వారా ప్రయోజనం కలగనుంది.

ఈ పథకంలో భాగంగా.. సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ లున్న డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించనున్నారు. సాధారణంగా.. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం అక్టోబర్‌ లో ఇవ్వాల్సిఉన్నా కరోనా కష్టాల నేపథ్యంలో నాలుగు నెలల ముందుగానే సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ పథకం కింద ఎంపికైన మొత్తం 2,62,493 మంది లబ్ధిదారుల్లో 61,390 మంది ఎస్సీలు, 1,17,096 మంది బీసీలు, 14,590 మంది ఈబీసీలు ఉండగా… కాపులు 29,643 మంది, ఎస్టీలు 10,049 మంది.. మైనార్టీలు 28,118 మంది.. బ్రాహ్మణులు 581 మంది, క్రైస్తవులు 1,026 మంది ఉన్నారు! వీరందరి బ్యాంక్ అకౌంట్లలో రేపు రూ. 10 వేల చొప్పున జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news