నేడు ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ జమ.. రూ.41.60 కోట్లు జమ

-

Jagananna Videshi Vidya Deevena Funds : ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలోని విద్యార్థులకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ కీలక ప్రకటన చేసింది జగన్ సర్కార్. నేడు ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ నిధులు జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.60 కోట్లు జమ చేయనుంది జగన్ సర్కార్.

CM YS Jagan Release Jagananna Videshi Vidya Deevena Funds

సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 95 మందికి.. ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ రిలీజ్ చేయనుంది. వారిలో తిరిగి మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకంగా రూ.100.50 లక్షలు అందించనుంది ఏపీ ప్రభుత్వం. మొత్తం రూ.42.6 కోట్లు నేడు బటన్‌ నొక్కి జమచేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. ఇవాళ ఉదయం 11 గంటలకు ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ నిధులు జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news