నేడు మాచర్ల పర్యటనకు సీఎం జగన్.. పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన

-

సీఎం వైఎస్‌ జగన్‌ పల్నాడు జిల్లా మాచర్ల పర్యటన ఖరారు అయింది. నేడు సీఎం వైఎస్‌ జగన్‌ పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్‌. అనంతరం మాచర్ల చెన్నకేశవ కాలనీ సభాస్ధలి వద్ద వరికపూడిసెల ప్రాజెక్టు శంకుస్ధాపన కార్యక్రమం వద్ద నిర్వహించే సభలో ప్రసంగించనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

CM YS Jagan's visit to Palnadu District Machars today
CM YS Jagan’s visit to Palnadu District Machars today

 

వాస్తావానికి వరికపూడిసెల పల్నాడుకు ఓ వరం లాంటింది. అలాంటి ఎత్తిపోతలకు నేడు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఆరు దశాబ్దాల చిరకాల స్వప్నం సాకారం నెరవేర్చనున్నానరు. పూర్తిగా పైప్ లైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్టుగా వరికపూడిసెల ప్రాజెక్టు నిలువనుంది. రూ.340.26 కోట్లతో ఎత్తిపోతల తొలిదశ పనులు జరుగనున్నాయి. దీంతో పల్నాడు, ప్రకాశం జిల్లాలు సస్యశ్యామలం ఏడు గ్రామాల పరిధిలో 24,900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అలాగే.. 20 వేల మంది జనాభాకు తాగునీరు అందనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news