కర్నూల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం..!

-

కర్నూలు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ , టీడీపీ మధ్య మాటల యుద్ధం నడించింది. ప్రభుత్వ హామీలపై వైసీపీ సభ్యులు నిలదీశారు. తాగునీటి విషయంలో కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మేయర్ బి.వై.రామయ్య, టీటీపీ సభ్యుడు పరమేష్ నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దూషణలు చేసుకున్నారు. వైసీపీ కార్పొరేటర్ పెద్దగా అరుస్తూ కుర్చీలు నెలకేసికొట్టారు.

దీంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. వైసీపీ కార్పొరేటర్లు అత్యుత్సాహం ప్రదర్శించారని టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సర్వసభ్య సమావేశంలో లేవనెత్తిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలేదని వైసీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news