బ్రేకింగ్:ఏపీలో ఆగని కరోనా మహమ్మారి, మళ్ళీ 10 వేలు

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 55 వేల వరకు కరోనా పరిక్షలు నిర్వహించగా 9 వేల 544 మంది కరోనా బారిన పడ్డారు అని రాష్ట్ర ప్రభుత్వ హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో 1312 కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో 1131 కేసులు నమోదు అయ్యాయి.

ap-corona
ap-corona

చిత్తూరు జిల్లాలో 1103 కేసులు వచ్చాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 వేల 92 మంది మరణించారు. గత 24 గంటల్లో 91 మంది ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 334940 కేసులు నమోదు అయ్యాయి. యాక్టివ్ కేసులు రాష్ట్రంలో 87 వేలు ఉన్నాయి. ఇప్పటి వరకు 31 లక్షల 29 వేల మందికి పైగా కరోనా పరిక్షలు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news