జగన్‌ ఇంటికి వెళ్లి..చంద్రబాబు ధన్యవాదాలు చెప్పాల్సిందే – సీపీఐ నారాయణ

-

జగన్‌ ఇంటికి వెళ్లి..చంద్రబాబు ధన్యవాదాలు చెప్పాల్సిందేనంటూ సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఫలితాలపై సీపీఐ నారాయణ మాట్లాడుతూ..జగన్ ఇంటికి బాబు వెళ్ళి పూల విష్ చేయాలి..అందరికంటే జగన్ ఎక్కువ కష్ట పడ్డాడని ఎద్దేవా చేశారు. వామ పక్షాల ఓట్ల శాతం పెరిగింది..పరిమితమైన సంతృప్తి లో ఉన్నామని వెల్లడించారు. ఏ.పిలో ఎవరికి అంతుపట్టని ఫలితాలు వచ్చాయి..గెలిచిన చంద్రబాబు కు పవన్ కళ్యాణ్ కు అభినందనలు అన్నారు.

CPI’s Narayana has given a thumbs up to Chandrababu

జగన్ మీద ఉన్న వ్యతిరేకత కూటమికీ కలిసి వచ్చింది…మోదీ కి చంద్రబాబు..నీతిష్ కుమార్ లేక పోతే మోదీ ప్రధాని కాలేడన్నారు. కచ్చితమైన ప్రతిపాదన కేంద్రం వద్ద చంద్రబాబు పెట్టిలి..విభజన హామీలు నెరవేర్చుకోవాలని కోరారు. ఏ.పికి ఫండ్స్ ఇప్పించూకోవాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేలా కాకుండా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలి..జగన్ పరిపాలన..చంద్రబాబు గుణపాఠంగా చూడాలని కోరారు. హైదరాబాద్ మీద చంద్రబాబు అంశాలు పెట్టూకోకుండా..ఏపి రాజధాని పై ఫోకస్ పెట్టాలి..పంతాలు పట్టింపులకు పోకుండా అభివృద్ధి పై ఫోకస్ పెట్టాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news