గుడ్‌న్యూస్‌… APPSC నుంచి క్రేజీ నోటిఫికేషన్

-

గుడ్‌న్యూస్‌… APPSC నుంచి క్రేజీ నోటిఫికేషన్ వచ్చేసింది. ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కంప్యూటర్ నైపుణ్య పరీక్ష రాసేందుకు APPSC నోటిఫికేషన్ ఇచ్చింది. ఉద్యోగులు ఇవాల్టి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులు, గ్రేడ్-1,2 వీఆర్వోలు, 2014 మే 12 తర్వాత కారుణ్య నియామకంలో పలు డైరెక్టర్లు, హెచ్ఓడీలు, ఇతర విభాగాల్లో చేరిన ఉద్యోగులు దరఖాస్తుకు అర్హులు.

ఇది ఇలా ఉండగా, కౌలు రైతులకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లోన్ చార్జ్ మాడ్యూల్ లో ఇప్పటివరకు భూయజమానుల వివరాలే ఉండగా….తాజాగా వెబ్ ల్యాండ్ పోర్టల్ తో CCRC పోర్టల్ ను లింక్ చేశారు. దీంతో ఇకపై భూ యజమానులతో పాటు కౌలుదారుల వివరాలు సైతం బ్యాంకర్లు తెలుసుకొని, పంట రుణాలు వారికి సులభంగా మంజూరు చేసే అవకాశం ఉంది. కాగా, ఈ సీజన్ లో కౌలు రైతులకు రూ. 4 వేల కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version