ఏపీలో విషాదం.. ఆన్లైన్ రుణ వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య….!

-

ఏపీలోని పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆన్లైన్ రుణ వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్థి బాలస్వామి నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఎర్రగుంట తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత ఏడాది ఆన్లైన్ లో రుణం తీసుకున్నాడు బాలస్వామి. అయితే.. వడ్డీకి వడ్డీ పెరిగిపోవడంతో, రుణం చెల్లించ లేకపోయాడు బాలస్వామి. దీంతో బాలస్వామి స్నేహితులకు ఫోన్లు చేసి వేధించడం ప్రారంభించారు ఆన్లైన్ ఫైనాన్స్ సంస్థలు.

crime in palnaadu

ఇటీవల ఎర్రగుంట తండాలో విద్యార్థి ఇంటికి వచ్చి ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు బెదిరించి వెళ్లారు. దీంతో మానసికంగా కృంగిపోయి జనవరి 26 న ఇల్లు వదిలి వెళ్లిపోయిన బాలస్వామి…సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే.. డిగ్రీ విద్యార్థి బాలస్వామి నాయక్ ఆత్మహత్యతో కన్నీరు మున్నీరు గా రోధిస్తున్నారు మృతుడి తల్లిదండ్రులు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news