BREAKING : ఏపీలో దారుణం..పొలాల్లో 7వ విద్యార్ధిని శవం కలకలం

-

 

ఏపీలోని ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎన్ గొల్లపల్లిలో దారుణం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలో ఆంజనేయస్వామి గుడి వెనుక పొలాల్లో బి.మంజుల అనే విద్యార్థిని దారుణహత్యకు గురైంది. విద్యార్థిని మంజులను చంపి గుర్తుపట్టకుండా ముఖాన్ని రాయితో ఛిద్రం చేశారు కొందరు దుండగులు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు.

దీంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు పోలీసులు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనిగిరి జెడ్పీ హైస్కూల్ లో ఏడవ తరగతి చదువుతున్న మంజులనే ఆ బాలిక అని గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినిని తల్లి వెంకట లక్ష్మి గుర్తించింది. భర్తతో విభేదాల నేపథ్యంలో కుమార్తె మంజులతో కలిసి విడిగా ఉంటోంది వెంకట లక్ష్మి. ఇక దీనిపై కేసు నమోదు చేసుకొని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే.. ఈ దారుణ ఘటనతో గ్రామస్తుల్లో భయాందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news