ఏపీలో అరాచక, కక్షపూరిత పాలన కొనసాగుతోంది – దగ్గుబాటి పురంధేశ్వరి

-

ఏపీలో అరాచక, కక్షపూరిత పాలన కొనసాగుతోందని జగన్‌ సర్కార్‌ పై విరుచుకుపడ్డారు ఏపీ బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరి. ఇవాళ విశాఖలో ఏపీ బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అరాచక, కక్షపూరిత పాలన కొనసాగుతోందని.. అప్పులు., మద్యం వంటి అంశాలలో పరిస్థితులు దిగజారిపోయాయని ఫైర్‌ అయ్యారు.

పోలవరం డిజైన్ లోపం వల్ల జరుగుతున్న అలస్యంకు కేంద్రానికి సంబంధం ఏమిటి…? అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేయకపోవడం వల్లే నిధులు రాలేదని ఆగ్రహించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఏపీ బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరి.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగిపోతోందని ఓ ఛానెల్‌ ద్వారా నేను ముందుగా చెబితే మాకు శాపనార్ధాలు పెట్టారు.. ఆ తరువాత జరిగింది అదేనని వెల్లడించారు ఏపీ బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోతే వెనుకబడిపోయామనే భావన ఇటీవల బాగా పెరిగిందన్నారు ఏపీ బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరి.

Read more RELATED
Recommended to you

Latest news