విశాఖలో అమానుషం.. దళిత బాలికపై గ్యాంగ్ రేప్

-

విశాఖలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఒడిశా నుంచి బతుకు దెరువు కోసం వచ్చిన ఓ కుటుంబం విశాఖ కంచరపాలెంలో నివసిస్తోంది. ఆ కుటుంబంలోని ఓ బాలిక రైల్వే న్యూ కాలనీలో ఓ ఇంట్లో కుక్కలకు ఆహారం పెట్టే పనిలో చేరింది. ఆ సమయంలో భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈనెల 18న ప్రియుడు ఆమెను హోటల్కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం తన స్నేహితుడిని రప్పించి రేప్ చేయమని చెప్పాడు.

మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకుందామని ఆర్కే బీచ్కు వెళ్లగా అక్కడ ఓ ఫొటోగ్రాఫర్ బాలికను లాడ్జికి తీసుకెళ్లి బంధించి అత్యాచారం చేశాడు. అతడితో సహా స్నేహితులు ఎనిమిది మంది రెండు రోజులపాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాలిక ఒడిశాలోని తన స్వగ్రామానికి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను ఒడిశాలో గుర్తించి విశాఖకు తీసుకొచ్చారు. జరిగిన విషయం చెప్పగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఇప్పటివరకు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రియుడు, అతడి స్నేహితుడు పరారీలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version