తిరుమల భక్తులకు అలర్ట్….ఆ రోజున వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు

-

 

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విడుదలపై కీలక ప్రకటన చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం మండలి. డిసెంబర్ 23 నుంచి 2024 జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 2.25 లక్షల రూ. 300 దర్శన టికెట్ల కోటాను నవంబర్ 10వ తేదీ ఆన్లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు.

తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది డిసెంబర్ 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని చెప్పారు. తిరుపతిలో 9 కేంద్రాలలో 100 కౌంటర్లలో డిసెంబర్ 22వ తేదీ వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులకు టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్లు 4.25 లక్షలు విడుదల చేస్తామన్నారు. ఈ విషయాన్ని దృస్టిలో పెట్టుకుని టికెట్లు బుక్‌ చేసుకోవాలని టీటీడీ కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news