Double Decker Buses In Vizag: ఏపీలో విశాఖపట్నం వాసులకు గుడ్ న్యూస్ అందజేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లను త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబుల్ డెక్కర్ తరహాలో మెట్రో నిర్మించాలని ప్లాన్ లో ఉన్నారు.

దీనికోసం ఆసియా మౌలిక వసతుల పెట్టుబడుల బ్యాంకు రుణం ఇవ్వడానికి అధికంగా ఆసక్తిని చూపిస్తోంది. మెట్రో రైలు మార్గం ఫ్లైఓవర్లు కలిపి ఒకేసారి నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కన్సల్టెంట్ ను నియమించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆసియా ఖండంలోనే పొడవైన డబుల్ డెక్కర్ మెట్రోగా విశాఖపట్నం నిలుస్తుందని స్పష్టం చేశారు. దీంతో విశాఖపట్నంలోని వాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందడుగు వేయడంతో ఏపీ వాసులు సంతోషపడుతున్నారు.