నేటి నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా

-

డిఎస్సి అభ్యరథులకు అలెర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి డిఎస్సి పరీక్షలు కొనసాగనున్నాయి. ఇవాళ ఉదయం నుంచి మెగా డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలకు మొత్తం 154 కేంద్రాలను ఎంపిక చేశారు. పరీక్ష ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

Big alert for those appearing for DSC exams in Andhra Pradesh state
DSC exams from today to the 30th

పరీక్ష కేంద్రాలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని డిఎస్సి కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. హాల్ టికెట్ల మీద ఫోటోలు సరిగ్గా లేకపోయినట్లయితే ప్రస్తుతం ఉన్న ఫోటోలు తీసుకెళ్లాలి. హాల్ టికెట్ మీద పూర్తిగా ఫోటో లేకపోయినట్లయితే రెండు ఫోటోలను తీసుకెళ్లాలి. హాల్ టికెట్ లో ఏమైనా పేరు, ఇంకేమైనా తప్పులు ఉన్నట్లయితే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి లాంటి గుర్తింపు కార్డులను తీసుకెళ్లి చూపించవచ్చు. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే పరీక్ష హాల్ లో చేస్తారు. దీంతో పరీక్ష రాసేవారు అలర్ట్ గా ఉండాలని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news