వైసీపీ రాష్ట్ర కమిటీలో ఎనిమిది మందికి పదవులు..!

-

వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీలో డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఎనిమిది మంది నేతలకు పదవులు దక్కాయి. వారిలో YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా అమలాపురం పట్టణం నుంచి చెల్లుబోయిన శ్రీను వాసరావు, బండారులంక గ్రామానికి చెందిన కామిశెట్టి శ్రీనివాసరావు నియమితులయ్యారు. రాష్ట్ర కమిటీల్లో ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన వీరు ఇప్పటి వరకు పార్టీలో వివిధ పదవులు నిర్వహిస్తున్నారు.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ కామిశెట్టి శ్రీనివాసరావును అభినందించి ఘనంగా సత్కరించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ని మరోసారి ముఖ్యమంత్రి ని చేసే దిశగా తమ వంతు కృషి చేస్తామని కొత్తగా పదవులు పొందిన నేతలు పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కి, మంత్రి పినిపే విశ్వరూప్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version