టిడిపి అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలు పెంచబోము – చంద్రబాబు

-

రానున్న ఎన్నికలలో టిడిపి అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెంచబోమని అన్నారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన “మహిళలతో ప్రజావేదిక” కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలపై విద్యుత్ భారం వేయకుండా సౌర, పవన విద్యుత్ ను తీసుకువస్తామని తెలిపారు.

పేదలను ధనికులుగా చేయాలన్నదే తన లక్ష్యమని అన్నారు. డబ్బు, భూమి కాదు.. ప్రజలే నా ఆస్తి అని స్పష్టం చేశారు. ప్రజల ద్వారా సంపద సృష్టించి ధనికులను చేస్తానని అన్నారు చంద్రబాబు. రైతులను ఆదుకుంటామని.. వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామన్నారు. అనేక ఆలోచనలు చేసి అభివృద్ధికి నాంది పలకాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version