ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కి కరోనా పాజిటివ్

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతోంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సామాన్య ప్రజలతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారినపడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

తాజాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా నిర్ధారణ కావడంతో ఎంపీ శ్రీధర్ హైదరాబాద్ లోని తన ఇంట్లో హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఆయనతో పాటు మరో నలుగురు కార్యాలయ సిబ్బందికి పాజిటివ్ అని తేలింది. దీంతో గత వారం రోజుల్లో తనను కలిసిన వారందరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఎంపీ విజ్ఞప్తి చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news