ఏపీ 10వ తరగతి వాల్యుయేషన్‌లో లోపాలు..5 మంది సస్పెండ్‌ !

-

ఏపీ SSC (టెన్త్) వాల్యుయేషన్‌లో లోపాలు బయటపడ్డాయని సమాచారం అందుతోంది. ఈ తరుణంలో 5 మంది వాల్యుయేటర్లను సస్పెండ్‌ చేసింది పాఠశాల విద్యాశాఖ. దింతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వైపాల్యంవల్లే అంటూ మండిపడుతున్నాయి ప్రతిపక్షనేతలు. టెన్త్ పరీక్షల్లో రికార్డు స్థాయిలో 66,363 రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులు వచ్చాయి.

Errors in AP 10th class valuation
Errors in AP 10th class valuation

11,175 స్క్రిప్టుల మార్కులలో లోపాలు గుర్తించారు. మూడు స్థాయిల్లో పర్యవేక్షణ ఉన్నా లోపాలు నివారించకపోవడంపై విద్యాశాఖ సీరియస్‌ అయ్యింది. జూన్ మొదటివారంలో RV, RC ఫలితాలు పూర్తి అవుతాయి. ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు చివరి తేదీ ముగియడంతో ఆందోళన చెందుతున్నారు విద్యార్థులు. జూన్ 5 నుంచి 10 వరకు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు గడువు పొడిగించాలని పాఠశాల విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news