ప్రతీ ఏడాది క్రిస్మస్ రోజు చర్చికి చంద్రబాబు.. పేర్నినాని సంచలన వ్యాఖ్యలు

-

ప్రతీ ఏడాది క్రిస్మస్ రోజు చర్చికి చంద్రబాబు ఎందుకు వెళ్లారని మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వివాదం పై నిరసన వ్యక్తం చేస్తూ.. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజలో పాల్గొన్నారు పేర్ని నాని.  తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రంజాన్ రోజు మసీదులో ప్రార్తనలు చేసే చంద్రబాబు నిఖార్సైన హిందువా..? అని ప్రశ్నించారు. జగన్ మతం ఏంటో ప్రజలకు తెలుసు అన్నారు.

తిరుమలకు వచ్చే వారందరూ డిక్లరేషన్ ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. వెంకన్న పై నమ్మకంతో మాజీ సీఎం జగన్ చాలా సార్లు తిరుమలకు వెళ్లారని తెలిపారు. ఇప్పుడు కొత్తగా జగన్ డిక్లరేషన్ ఇవ్వడం ఏంటని నిలదీశారు. జగన్ మోహన్, తాత తండ్రి ఏసు ప్రభువును కొలవడం మొదలు పెట్టారని ప్రజలకు తెలుసు అని చెప్పారు. దేవుడికి బూట్లు వేసుకొని కొలిచే చంద్రబాబును పవన్ కళ్యాన్ ప్రశంసించడం ఏంటన్నారు. ఇటీవలే క్రిస్టియన్ నటి శ్రీవారిని దర్శించుకున్నారని.. ఆమె డిక్లరేషన్ ఇచ్చారా..? అని నిలదీశారు పేర్ని నాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version