పవన్ కళ్యాణ్ వెంట తిరుగుతూ యువత జీవితం నాశనం చేసుకోవద్దు – మాజీమంత్రి అనిల్

-

అభిమానం పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంట తిరుగుతూ యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కి జై కొడుతూ జనసైనికులు తమ భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని అన్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ కి గ్యారెంటీ లేదని, క్లారిటీ లేదని.. అలాంటిది ఆయన జన సైనికులకు, ప్రజలకు ఏం భరోసా ఇస్తారని ప్రశ్నించారు.

సీఎం జగన్ ను పవన్ కళ్యాణ్ తక్కువగా అంచనా వేస్తున్నారని అన్నారు. వారాహి యాత్ర కారణంగా వెహికల్ కు పెట్రోల్ దండగని అన్నారు అనిల్ కుమార్ యాదవ్. 2024లో పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయమని అన్నారు. ఏపీలో తమ గెలుపును ఎవరు ఆపలేరని అన్నారు. మహిళా శక్తి అంటూ తిరిగే టిడిపి నేతలకు చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడడం సరికాదని.. కత్తితో మహిళపై దాడి చేయడమేనా మహిళా శక్తి అని చురకలంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news