టిడ్కో ఇళ్లపై వాస్తవాలు ఇవీ… పేదల ఆశల సౌధాలు

-

టిడ్కో ఇళ్ల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. కుటుంబ సమేతంగా ఆనందంగా ఉండాలని ఇల్లు వస్తే బాగుంటుంది అని ఎంతో మంది ఆశ పడుతున్నారు. ఈరోజు ఈ ఇళ్ల గురించి నిజా నిజాలు ఏంటి అనేది తెలుసుకుందాం చాలా మందికి వాస్తవాలు ఏంటో తెలియదు. మరి టిడ్కో ఇళ్లపై వాస్తవాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం… పేదలకు ఇవే పెద్ద పెద్ద మేడలు. ఎంతో మంది వీటి కోసం చూస్తున్నారు. చిన్న కుటుంబాలు నివసించేందుకు అనువుగా ఉంటాయి ఇవి. పిల్లా పాపలతో ఇవి వస్తే ఉండాలని ఎంతోమంది ఆశ పడుతున్నారు. పేద, దిగువ మధ్యతరగతి వాళ్ళు టిడ్కో ఇళ్ల కోసం కలలు కంటున్నారు.

అసలు వీటిని ఎవరు నిర్మించారు…? ఎవరు వీటి కోసం ఎక్కువ నిధులు కేటాయించారు…? ఈ విషయాలని ఇప్పుడు చూసేద్దాం. గత కొన్ని రోజుల నుండి ఎవరు కట్టించారు అనే దాని మీద చర్చ సాగుతోంది. మేమే కట్టించాము అంటే మేమే అని వాదించుకుంటున్నారు. పేదలకు తక్కువ ధరకి… 300 అడుగులున్న చిన్న ఫ్లాట్స్ ఫ్రీగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చారు. అయితే 365, 430 అడుగుల ఫ్లాట్స్ ని మాత్రం సగం ధర కి ప్రజలకు ఇచ్చారు.

దీనితో పాటు తాగు నీరు, రోడ్లు, విద్యుత్ వంటి ఫెసిలిటీస్ ని ఇచ్చారు. ఇలా సీఎం వైయస్ జగన్ లక్షల మంది కళ్ళలో ఆనందాన్ని చూసారు. చాలా మంది ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని భావించారు. కానీ ఇది పక్కన పెడితే ప్రాజెక్టు నిధుల్లో కనీసం పదిపైసల కూడా పెట్టని చంద్ర బాబు గవర్నమెంట్ మాత్రం వాళ్ళే ఏదో చేసినట్టు అంతా తామే చేసాం అంటూ అక్కడ సెల్ఫీలు దిగుతూ ప్రజలను మభ్య పెడుతున్నారుచంద్రబాబు, టిడిపి కార్యకర్తలు. ఈ విషయం పై వాస్తవం ఏమిటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.

  • ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ.28వేల కోట్లపైనే ఖర్చు అయింది. చంద్రబాబు ప్రభుత్వం ఖర్చుచేసింది సగం కంటే తక్కువే. సో చంద్రబాబు ప్రభుత్వం తామే కట్టేశామని అనడం నిజం కాదు.
  • కరోనా సంక్షోభం ఉన్నా కూడా ఇప్పటికే 62000 ఇళ్లు పూర్తి చేసింది వైఎస్సార్ ప్రభుత్వం.
  • టిడ్కో ఇళ్లు మురికి కుప్పలు కాకుండా మౌలిక సదుపాయాలు కోసం మూడు వేలకోట్లు ఖర్చుపెట్టింది. రోడ్లు, సీవరేజి వంటివి సదుపాయాలు కూడా.
  • జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్లపై ఇప్పటివరకూ రూ.8734 కోట్లు ని ఖర్చు చేసారు. అలానే గత ప్రభుత్వం వదిలేసిన బిల్స్ రూ.3వేల కోట్ల బకాయిలు తీర్చారు.
  • 300 అడుగుల టిడ్కో ఇల్లు కోసం లబ్ధిదారులు నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లపాటు పే చేయాల్సి ఉండేది చంద్రబాబు ప్రభుత్వం హయాంలో. ఇరవయ్యేళ్ళ తరువాత ఆ మొత్తం దాదాపు రూ. 7. 2 లక్షలు అయ్యేది.
  • 300 అడుగుల ఇంటిని జగన్ ఫ్రీగా ఇచ్చారు. దీని వల్ల ప్రభుత్వంపై రూ. 5,340 కోట్లు భారం పడింది. అంతే కాదు గవర్నమెంట్ ఏ 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల ఫ్లాట్ల అడ్వాన్స్‌ చెల్లింపుల్లో 50 శాతం రాయితీ భరించింది. ప్రభుత్వంపై అదనపు భారం మరో రూ.482.31 కోట్లు.
  • 143600 మందికి ఒక్క రూపాయికే 300 అడుగుల ఫ్లాట్స్ ని.. 365, 430 అడుగులతో 2. 62 లక్షలు.
  • ఫ్రీ రిజిస్ట్రేషన్‌ కి రూ.1200 కోట్ల ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది.
  • సబ్సిడీల రూపంలో రూ. 14,514 కోట్లు, మొత్తం ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ. 18,714 కోట్లు.
  • లబ్ధిదారులకు అప్పగించినవి 61,948. ఈ ఏడాది చివరకు అందించే ఫ్లాట్స్ 2, 62, 216.

Read more RELATED
Recommended to you

Latest news